ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో స్టీల్ డబ్బాలో పేలుడు పదార్థాలను గుర్తించారు. మావోయిస్టులే బాంబు అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిగిని, కంఠేగావ్, కైలాసటేక్డీ, బాబెరా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలో ప్రాణహిత నది మీదుగా మావోయిస్టులు జిల్లాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు దళాలు వారం నుంచి అడవులను జల్లెడ పడుతున్నాయి. గ్రామ పెద్దలతో కలిసి ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిర్పూర్-టీ, బెజ్జూరు, దహెగం, పెంచికల్పేట్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో.. నిర్బంధ తనిఖీలు చేప్టటారు.