తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 1:28 PM IST

ETV Bharat / state

Border: సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు.. పాసుంటేనే ప్రవేశం

మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్​ జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అత్యవసర వాహనాలు మినహా పాసులుంటేనే ఇతరులను అనుమతిస్తున్నారు. మరోపక్క వీధుల్లో జనసంచారం తగ్గినందున అభివృద్ధి పనును మున్సిపల్‌ అధికారులు వేగవంతం చేశారు.

Police special focus on lock down
ఆదిలాబాద్​ జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో పోలీసుల తనిఖీలు

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా నిబంధనలను పోలీసు యంత్రాంగం కఠినంగానే అమలు చేస్తోంది. సరిహద్దుల వద్ద నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. అంబులెన్సులు, అత్యవసర సేవల వాహనాలను మినహాయిస్తే మిగతా వాటికి పాసులుంటేనే ప్రవేశం కల్పిస్తోంది.

మరోపక్క వీధుల్లో జనసంచారం తగ్గినందున అభివృద్ధి పనును మున్సిపల్‌ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పుడిప్పుడే కరోనా కాస్తంత తగ్గుముఖం అంటున్న అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో మధ్యాహ్నం తరువాత తలెత్తే క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న పోలీసు, మున్సిపల్‌ అధికారులతో మా ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల నిఘా

ఇదీ చూడండి:Suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details