No Funds for Railway Over Bridge in Adilabad : ఆదిలాబాద్ పట్టణంలో సంజయ్నగర్ ప్రాంతంలో ఆర్ఓబీ, తాంసీ బస్టాండ్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.91.20 కోట్లు మంజూరు ఇచ్చింది. ఇందులో రూ.57. 71కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా మరో రూ.39.49కోట్లు కేంద్ర ప్రభుత్వ వాట ఉన్నది. గ్రామీణ రహదారులు, భవనాల శాఖ 2022 నవంబర్ 24న హైదరాబాద్కు చెందిన తనిష్క్ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం 2024లో పూర్తిచేయాల్సి ఉంది. ఈలోగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చి.. పూర్తిస్థాయి పనులు చేపట్టాలనేదానిపై స్పష్టత కొరవడుతోంది.
Compensation not Given Railway Under Bridge in Adilabad : సంజయ్నగర్, తాంసీ బస్టాండ్ ప్రాంతాల్లో నిర్వాసితులవుతున్న ఇళ్లు, దుకాణ సముదాయాలను గుర్తించిన మున్సిపల్ యంత్రాంగం తయారుచేసిన నివేదికను ఆర్అండ్బీకి నివేదించింది. వాటికి రూ.51.25 కోట్ల పరిహారం ఇవ్వాలని తేల్చిన ఆర్అండ్బీ నివేదిక రెవెన్యూ శాఖకు వెళ్లింది. కానీ ఇంతవరకు నయాపైసా విడుదల కాలేదు. మరోపక్క నిర్వాసితులవుతున్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వకుండానే ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయాలని మున్సిపల్ యంత్రాంగం ఒత్తిడి చేస్తుండటంతో ఆందోళనకు దారితీస్తోంది. మార్కెట్ ధరలకంటే తక్కువ పరిహారం నిర్ణయించడమే కాకుండా.. ప్రకటించిన పరిహారం కోసం నెలలు తరబడిగా తిప్పుకుంటున్నారనిబాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఆరు నెలల క్రితం ప్రభుత్వం మాకు నోటీసులు ఇచ్చింది. దానికి మేము సమాధానం ఇచ్చాం. మాకు పరిహారం డబ్బులు పేపర్ల కింద చూపిస్తున్నారే తప్ప.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. వంతెన ఏర్పాటు చేసిన ప్రాంతం అంతా ఖాళీ చేశాం. దానివల్ల మేము ఆదాయం కోల్పాయాం. కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నాం. కానీ పరిహారం చెల్లించలేదు. మాకు ఇవ్వాల్సిన పరిహారం త్వరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."-మహ్మద్ అలీ, ఆదిలాబాద్
Karimnagar Bridges: శిథిలావస్థకు కల్వర్టులు... ముందకు సాగని పనులు