ఎస్సీ, ఎస్టీలు సాగు చేస్తున్న భూములను అధికార పార్టీ నేతలు, అధికారులు బలవంతంగా లాక్కుని ఆయా అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ నిరాహార దీక్ష చేపట్టింది.
అసైన్డు భూములను పరిరక్షించాలని కలెక్టరేట్ ఎదుట దీక్ష - ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ నిరాహార దీక్ష
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములను తెరాస నేతలు, అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని ఎమ్మార్పిఎస్ నాయకులు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిటా అసైన్డు భూములను వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు.
mrps
పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు వంటివి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.