అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఆదిలాబాద్ పట్టణం టీచర్స్ కాలనీలో నిధుల సమీకరణ కార్యక్రమం ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. తన వంతుగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులకు లక్ష రూపాయల విరాళం అందజేశారు.
రామమందిర నిర్మాణానికి ఎంపీ సోయం బాపురావు లక్ష విరాళం - Adilabad District Latest News
రామమందిర నిర్మాణం కోసం ఆదిలాబాద్ పట్టణంలో నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. తన వంతుగా లక్ష రూపాయల విరాళం అందజేశారు. హిందువులు స్వచ్ఛందంగా ఇవ్వాలని ఎంపీ కోరారు.

ఎంపీ సోయం బాపురావు లక్ష విరాళం
భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ 50వేల విరాళం ఇచ్చారు. ఇంటింటికి తిరిగి నిధులు సమీకరించారు. వారితోపాటు రామచంద్రా గోపాల కృష్ణ మఠాధిపతి యోగనంద సరస్వతి ఉన్నారు. హిందువులు స్వచ్ఛందంగా ఇవ్వాలని ఎంపీ కోరారు.
ఇదీ చూడండి:'రామ మందిర నిర్మాణానికి ప్రతీ హిందువూ సహకరించాలి'