తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఎంపీ సోయం బాపురావు గృహనిర్బంధం

విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌ భాజపా ఎంపీ సోయం బాపురావు తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. గృహ నిర్బంధంలో ఉంచారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

By

Published : Jun 15, 2020, 2:22 PM IST

SOYAM BAPURAO
SOYAM BAPURAO

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్‌ ఛార్జీల పెంపుపై భాజపా తలపెట్టిన ధర్నాను ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు.

పోలీసుల తీరును నేతలు తప్పుపట్టారు. మూడు నెలలకు వసూలు చేస్తున్న ఛార్జీలను సగానికే పరిమతం చేయాలని ఎంపీ సోయం డిమాండ్‌చేశారు.

ఇదీ చదవండి:ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

ABOUT THE AUTHOR

...view details