తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2019, 3:24 PM IST

ETV Bharat / state

రాజీ మార్గమే రాచమార్గం

పెండింగ్ కేసులు లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ చేసుకోవడమే మంచిదని ఆదిలాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని తెలిపారు.

రాజీ మార్గమే రాచమార్గం

రాజీమార్గమే రాచమార్గంగా నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి జీవన్‌ కుమార్‌, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఆయా కేసుల్లో రాజీ కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చిన కక్షిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లోక్‌ అదాలత్‌ కేసుల్లో పరిష్కారమైన కక్షిదారులు కోర్టులు చుట్టూ తిరగనక్కర్లేదని న్యాయమూర్తి తెలిపారు.

రాజీ మార్గమే రాచమార్గం

ABOUT THE AUTHOR

...view details