మొక్క నాటు... సెల్ఫీ దిగు - మొక్క నాటు... సెల్ఫీ దిగు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటారు. మొక్కను కాపాడతామని సెల్ఫీ దిగి వాగ్దానం చేశారు.
మొక్క నాటు... సెల్ఫీ దిగు
ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఈస్టర్ పాఠశాల విద్యార్థులు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో మొక్కలు నాటారు. తాము నాటిన మొక్కలను ఎల్లప్పుడు సంరక్షిస్తూ ఉంటామని వాగ్దానం చేస్తూ సెల్ఫీలు దిగారు.
- ఇదీ చూడండి : వృద్ధురాలి ప్రాణం తీసిన ఆవు!