ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో వాగులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాల మట్టం పెరిగింది. ఇచ్చోడ, హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్ తలమడుగు మండలాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు కురవడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండినపోయిన పంటలకు జీవం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 89.04 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇదే మండలంలో వర్షాల ధాటికి ఓ మహిళ ఇల్లు కూలిపోయింది.
బోథ్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వానలు
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 89.04 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఎడతెరిపి లేని వానలు