తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 2:14 PM IST

ETV Bharat / state

750 మందికి 30 కేంద్రాల్లో కరోనా టీకా డ్రైరన్​

ఆదిలాబాద్​ జిల్లాలో వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​ నిర్వహించారు. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో ముందుండి విధులు నిర్వహించిన 750 మందిని గుర్తించి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

corona vaccine dry run, adilabad
కరోనా టీకా డ్రై రన్​, ఆదిలాబాద్​

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా టీకా నిర్వహణపై వైద్యారోగ్యశాఖ డ్రైరన్‌ చేపట్టింది. జిల్లాలో త్వరలో ఇవ్వనున్న వ్యాక్సిన్​పై అపోహలకు తావులేకుండా ఈ డ్రైరన్​ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ సమయంలో ముందుండి విధులు నిర్వహించిన 750 మందిని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వీరందరికీ జిల్లాలోని 30 కేంద్రాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టింది. టీకా తీసుకున్న తరువాత సిబ్బంది పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఇదీ చదవండి:ఫిబ్రవరి నుంచి భారత్​ బయోటెక్​ నాజల్ డ్రాప్​ టీకా​ తొలిదశ ట్రయల్స్

ABOUT THE AUTHOR

...view details