ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్గూడ గ్రామానికి చెందిన కత్తి అక్కమ్మకు రోడ్డు పక్కనే ఐదెకరాల పొలం ఉంది. కుమారుడు అశోక్తో కలిసి ఆ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రహదారి విస్తరణలో భాగంగా అక్కమ్మ పొలంలోంచి రోడ్డు వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... పోలీసులకు పట్టిస్తామంటూ గుత్తేదార్లు భయపెడ్తున్నారు. బాధిత రైతులు పనులను అడ్డుకుంటే... అర్ధరాత్రుల్లో పనులు చేస్తున్నారని చెబుతున్నారు. సాయం చేయండంటూ అధికారుల వద్దకు వెళ్తే... మాట కూడా మాట్లాడకుండా ఇబ్బందులు పెడ్డుతున్నారు.
నయాపైసా పరిహారమైనా చెల్లించలే...
ప్రభుత్వం రూ.85 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన ఆదిలాబాద్-గాదిగూడ రహదారి విస్తరణ పనులను సీ-5 గుత్తేదారు సంస్థ చేజిక్కించుకుంది. అందులో భాగంగానే యాపల్గూడ సమీపంలో ఉన్న అక్కమ్మ పొలంలో దౌర్జన్యంగా పనులు చేస్తోంది. కనీసం బాధిత కుటుంబానికి చెప్పను కూడా చెప్పలేదు. ఉన్నఫలంగా భూమిలోంచి రోడ్డు వేస్తూ... నయాపైసా పరిహారమైనా చెల్లించలేదు. ఏం చేయాలో పాలుపోని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతూ... అవస్థలు పడుతున్నారు. తమ జీవనాధారమైన భూమిని లాక్కోవడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.