ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగిందని, రాజ్యాంగం రచించిన మహనీయుడి పట్ల ప్రభుత్వం సరైన విలువలు పాటించట్లేదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దేశ ప్రజలు ఆరాధ్యంగా కొలిచే అంబేడ్కర్కు నివాళులు అర్పించలేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి, మరో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ నివాళికి కేసీఆర్కు సమయం లేదా? - CM KCR HAS INSULTED AMBEDKAR
హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహ కూల్చివేత ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మరో విగ్రహం ఏర్పాటు చేయాలని నినదించారు.

నిందితులను శిక్షించి, మరో విగ్రహం ఏర్పాటు చేయాలి : కుడాల స్వామి
హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది : ఎమ్మార్పీఎస్
ఇవీ చూడండి : 'కేసీఆర్ అంబేడ్కర్ను అవమానిస్తున్నారు'