తెలంగాణ

telangana

ETV Bharat / state

'విదేశాల నుంచి వచ్చిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి' - corona effect in adilabad

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్​ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్​ మనోహర్​ అన్నారు. ఉట్నూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి కొవిడ్-19 సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

doctor manohar visited foreign returns in adilabad district
'విదేశాల నుంచి వచ్చిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి'

By

Published : Mar 23, 2020, 3:07 PM IST

'విదేశాల నుంచి వచ్చిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి'

గల్ఫ్​ దేశాల నుంచి ఆదిలాబాద్​ జిల్లాకు వచ్చిన ప్రజలను జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్​ మనోహర్​ ​ పరిశీలించారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

విదేశాల నుంచి వచ్చిన వారు వీలైనంత వరకు ప్రత్యేక గదిలో ఉండాలని డాక్టర్​ మనోహర్​ సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్​ సోకకుండా జాగ్రత్తపడవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details