తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 4:10 PM IST

ETV Bharat / state

'రాజ్యాంగాన్ని అనుసరించడం పౌరుల ప్రథమ కర్తవ్యం'

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్​ జిల్లా కోర్టులో అంబేడ్కర్​ చిత్రపటానికి న్యాయమూర్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని అనుసరించి విధులు నిర్వహిస్తామని ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు.

constitutional day pledge in adilabad district court
'రాజ్యాంగాన్ని అనుసరించడం పౌరుల ప్రథమ కర్తవ్యం'

భారత రాజ్యాంగం గొప్పదని, దాన్ని అనుసరించడం దేశపౌరుల ప్రథమ కర్తవ్యమని ఆదిలాబాద్​ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌ కుమార్‌ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగాన్ని అనుసరించి విధులు నిర్వహిస్తామని వివిధ కోర్టుల న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో ప్రధాన న్యాయమూర్తి ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చదవండి:సింగరేణిలో సమ్మె... సంస్థకు కోట్లలో నష్టం

ABOUT THE AUTHOR

...view details