ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అధికార తెరాస వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జీ జి.నిరంజన్ తెలిపారు. తాము ముందు నుంచి అనుకున్న విధంగానే అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.
బలవంతంగా ఉపసంహరణ చేయించారు...
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 34వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన ధర్మాగౌడ్ను బలవంతంగా ఉపసంహరణ చేయించారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగురామన్న పథకం ప్రకారం తన కొడుకు జోగు ప్రేమేందర్ను బరిలోకి దించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లేకుండా చేశారని విమర్శించారు. అది కూడా పోలీసుల ముందే బలవంతంగా విత్డ్రా చేయించినట్లు ఆరోపించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.