తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2021, 3:30 PM IST

ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఆదిలాబాద్ పట్టణంలో భాజపా కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

bjp blood donation camp
bjp blood donation camp

ఆదిలాబాద్ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. రక్తదానంలో పాల్గొన్న 80 మందిని జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రత్యేకంగా అభినందించారు. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతోన్న తరుణంలో రక్తం నిల్వల కొరత రాకుండా శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details