తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​కు వినతిపత్రం అందజేసిన భాజపా జిల్లా అధ్యక్షుడు

వెంటనే రైతులకు రుణమాఫీ చేసి, రైతుబంధు నిధులు రైతులు ఖాతాల్లో జమ చేయాలని ఆదిలాబాద్​ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

By

Published : May 27, 2020, 3:54 PM IST

bjp leader issue petition to adilabad district collector
కలెక్టర్​కు వినతిపత్రం అందజేసిన భాజపా జిల్లా అధ్యక్షుడు

ఒకేసారి రుణమాఫీ చేసి, రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి కలెక్టర్ శ్రీదేవసేనకి వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ లక్ష రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు.

రైతుబంధు విషయంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:పింఛన్ల కోతపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details