తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2020, 8:08 AM IST

ETV Bharat / state

ఆదిలాబాద్​లో భారత్ బంద్... డిపోలకే పరిమితమైన బస్సులు

వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతూ నేడు భారత్ బంద్​కు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్​లో తెరాసతో సహా పలు పార్టీలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆర్టీసీ డిపో ముందు పలువురు నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

bharat bandh in adilabad district
ఆదిలాబాద్​లో భారత్ బంద్... డిపోలకే పరిమితమైన బస్సులు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ డిపో ఎదుట అధికార పార్టీ తెరాసతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉదయం నుంచే డిపో ముందు నేతలు బైఠాయించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో కార్మికులు బయటే ఉండిపోయారు.

ఈ ఆందోళనలో ఆదిలాబాద్ పుర అధ్యక్షులు జోగు ప్రేమనగర్, కాంగ్రెస్ ఇంఛార్జ్ సాజిద్ ఖాన్, సీపీఐ, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రైతన్న పోరు: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్​ బంద్

ABOUT THE AUTHOR

...view details