తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల పంపిణీ - ఆదిలాబాద్‌ జిల్లా తాజా వార్తలు

దివ్యాంగుల కష్టాలను చూసి గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ వారికి తోడుగా నిలుస్తోంది. మనలాగే వారు సమానమేనని చాటి చెబుతోంది. వారి కోసం ఆదిలాబాద్‌ జిల్లాలో ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయరు స్వామి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Artificial body parts distribution to handicaps in adialabad district
గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల పంపిణీ

By

Published : Nov 5, 2020, 4:51 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్‌ఛైర్లు, మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలను వారికి అందించారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు తరలి వచ్చారు.

ఈ కార్యక్రమానికి చిన జీయరు స్వామిజీ ముఖ్యఅతిథిగా హాజరై దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కరోనాను జయించే శక్తిని మనందరం పొందాలని స్వామిజీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, రామచంద్రగోపాలకృష్ణ, మఠాధిపతి యోగానంద సరస్వతి, అహోబిల జీయరుస్వామి, ట్రస్ట్ ప్రతినిధి జగదీష్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'రాష్ట్రాన్ని దేశంలోనే తలమానికంగా నిలిపేలా కృషి చేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details