తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వేస్టేషన్‌ ఎదుట ఆందోళనకారుల నిరసన - telangana news today

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా రైల్‌‌రోకో నిర్వహిస్తున్నారు. ఈ నిరసనకు మద్దతుగా ఆదిలాబాద్‌ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు.

aikscc leaders protest in front of the railway station at adilabad
రైల్వేస్టేషన్‌ ఎదుట ఆందోళనకారుల నిరసన

By

Published : Feb 18, 2021, 2:57 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆదిలాబాద్‌ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ ఎదుట నిరసన తెలిపిన ఆందోళనకారులు... లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

స్టేషన్‌ ఎదుట నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి :డీజీపీ కార్యాలయ ముట్టడికి 'భాజపా' యత్నం.. ఉద్రిక్తం

ABOUT THE AUTHOR

...view details