ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. వ్యవసాయ శాఖపై చర్చ మొదలు పెట్టారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పాల్సి ఉండగా ఆమె అందుబాటులో లేదు. ఆమెకు బదులు ఇన్ఛార్జి అధికారికి సమావేశానికి హాజరయ్యారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో.. వ్యవసాయాధికారి రాకపోవడంపై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రశ్నించారు. ఆమె గతంలోనూ ఇలాగే సెలవులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.