తెలంగాణ

telangana

ఆదిలాబాద్​ జెడ్పీ వైస్​ ఛైర్మన్​ కన్నుమూత!

కరోనాతో పోరాడుతూ ఆదిలాబాద్​ జెడ్పీ వైస్​ ఛైర్మన్​ ఆరె రాజన్న  హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెరాస తరఫున జెడ్పీటీసీగా గెలుపొందిన ఆయన జెడ్పీ వైస్​ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే జోగు రామన్నకు అత్యంత సన్నిహితుల్లో రాజన్న ఒకరు.

By

Published : Sep 7, 2020, 9:52 AM IST

Published : Sep 7, 2020, 9:52 AM IST

Adilabad Vice Chairman Aare Rajanna Died With Corona
ఆదిలాబాద్​ జెడ్పీ వైస్​ ఛైర్మన్​ కన్నుమూత!

ఆదిలాబాద్​ జెడ్పీ వైస్​ ఛైర్మన్​ ఆరె రాజన్న కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు పాజిటివ్​గా నిర్ధారణ కాగా.. ఆదిలాబాద్​లోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఓ కార్పోరేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్​ మండలం చాందా గ్రామానికి చెందిన రాజన్న గ్రామ సర్పంచ్​గా, ఆదిలాబాద్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​గా పనిచేశారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొంది ఆదిలాబాద్​ జిల్లా పరిషత్​ వైస్​ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న సన్నిహితుల్లో రాజన్న ఒకరు. ఆయన మృతితో జోగు రామన్న విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details