ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్సలు, సహాయక చర్యలపై ఎమ్మెల్యే జోగురామన్న అధికారులతో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అదనపు పాలనాధికారి డేవిడ్, రిమ్స్ డైరెక్టర్ బలరాం బానోత్, ఇతర జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత అంశంపై చర్చిస్తుండగా.. రిమ్స్ డైరెక్టర్ ఒక్కసారిగా తన అసహనాన్ని వెల్లగక్కారు. తాను ఎమ్మెల్యే మాట వినడం లేదని తనపై కక్షకట్టారంటూ ఆరోపించారు. తనను ప్రభుత్వం నియమించిందని.. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను పని చేస్తానన్నారు. తన తీరు నచ్చకపోతే బదిలీ చేయించుకోండంటూ ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.