తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కు మరిస్తే... కఠిన చర్యలే! - lock down rules strictly implemented in adilabad

ఆదిలాబాద్​లో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

adilabad police are taking strict action
మాస్కు మరిస్తే... కఠిన చర్యలే!

By

Published : May 12, 2020, 11:10 AM IST

మాస్కు ధరించకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ఆదిలాబాద్​ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​లో కొన్ని నిబంధనలు సడలించడం వల్ల ప్రజలు రహదారులపైకి వస్తున్నారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చిన వారి పేర్లు, వివరాలను ఆదిలాబాద్​ జిల్లా పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. అక్కడే వారి వద్ద ఉన్న కర్చీఫ్​తో మాస్కు కట్టించి పంపిస్తున్నారు. రెండో సారి నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రాకపోకలపై పోలీసులు నిఘాను పటిష్ఠం చేశారు.

ABOUT THE AUTHOR

...view details