తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్‌లైన్‌ విద్యను సద్వినియోగం చేసుకోవాలి : డీఈవో రవీందర్​ రెడ్డి

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విద్యార్థులకు ఇంటి వద్దే విద్య అందించే ఉద్దేశ్యంతో  నిర్వహిస్తున్న ఆన్​లైన్​ తరగతులకు విద్యార్థులంతా హాజరు కావాలని, ఆన్​లైన్​ విద్యను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్​ జిల్లా విద్యాధికారి రవీందర్​ రెడ్డి అన్నారు. గుడిహత్నూర్ర్ మండలంలోని మన్నూర్​లో ఆయన పర్యటించి విద్యార్థులతో ముచ్చటించారు.

By

Published : Sep 7, 2020, 9:07 AM IST

Adilabad Deo Visits mannur Village
ఆన్‌లైన్‌ విద్యను సద్వినియోగం చేసుకోవాలి : డీఈవో రవీందర్​ రెడ్డి

ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్​ మండల పరిధిలోని మన్నూర్​లో జిల్లా విద్యాధికారి రవీందర్​ రెడ్డి పర్యటించారు. విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. సమయాన్ని వృథా చేయకూడదని, విద్యార్థులంతా ఇంటిపట్టున ఉంటూ.. ఆన్​లైన్​ విద్యను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్​లైన్​ తరగతులకు విద్యార్థులంతా హాజరు కావాలని సూచించారు. లాక్​డౌన్​ సమయంలో విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఆన్​లైన్​ విద్య ఉపయోగపడుతుందని తెలిపారు. స్మార్ట్​ఫోన్​, టీవీలలో డిజిటల్​ పాఠాలు వినాలని విద్యార్థులకు సూచించారు. ఆన్​లైన్​ పాఠాలు వినే క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత వరకు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. గ్రామాల్లో తిరిగి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. డీఈవోతో పాటు.. ఈ పర్యటనలో ఎంఈవో నారాయణ, ఉపాధ్యాయులు ధర్మేందర్​ సింగ్, నీల ఉన్నారు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details