తెలంగాణ

telangana

ETV Bharat / state

'జంగల్‌ సఫారిని ప్రారంభించిన పాలనాధికారి'

ఆదిలాబాద్‌ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్‌ సఫారి, సైక్లింగ్‌ను పాలనాధికారి దివ్య దేవరాజన్‌ ప్రారంభించారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసమే సిద్ధం చేశామని జిల్లా అటవీ  శాఖ అధికారి తెలిపారు.

By

Published : Apr 26, 2019, 12:16 AM IST

రూ.50 రుసుముతో జంగల్‌ సఫారి,గంటకు రూ.10 చొప్పున సైకిల్​

ఆదిలాబాద్‌ జిల్లా మావల మండల పరిధిలో వెయ్యి ఎకరాల హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్‌ సఫారి, సైక్లింగ్‌ను కలెక్టర్ దివ్య దేవరాజన్‌ ప్రారంభించారు. రూ.50 రుసుముతో జంగల్‌ సఫారిలోకి, గంటకు రూ.10 చొప్పున సైక్లింగ్​​ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సౌకర్యాలతో అడవిలోని అందాలను తిలకించవచ్చని జిల్లా అటవీ అధికారి ప్రభాకర్‌ తెలిపారు.

హరితవనంలో ప్రారంభమైన జంగల్‌ సఫారి, సైక్లింగ్‌

ABOUT THE AUTHOR

...view details