తెలంగాణ

telangana

ETV Bharat / state

కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం

చాలమందికి సొంత ఇళ్లు అనేది ఒక కల. ఆ కలను నెరవేర్చుకున్నాడు. ఆ ఇంటి కోసం మరమ్మతులు చేస్తున్నాడు. అప్పుడే అతన్ని మృత్యువు పలకరించింది. కొత్తగా కట్టుకుంటున్న ఇంటి గోడకు క్యూరింగ్​ చేసే సమయంలో కరెంట్​ షాక్​ కొట్టి మరణించాడు ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ డ్రైవర్​.

By

Published : Feb 20, 2020, 3:35 PM IST

కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం
కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ రఫీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తాను కొత్తగా కట్టుకుంటున్న ఇంటి గోడకు క్యూరింగ్ చేసే సమయంలో షాక్​కు గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అచేతనంగా పడి ఉన్న మహమ్మద్​ను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

కట్టుకుంటున్న ఇంట్లోనే మరణం.. విద్యుదాఘాతమే కారణం

ఇవీ చూడండి:సినీనటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details