తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ పత్తి మార్కెట్​యార్డులో బయట పడిన మోసం - ఆదిలాబాద్​ మార్కెట్​ యార్డ్ వార్తలు

పత్తి మార్కెట్‌యార్డుకు ఒకసారి పత్తిని తీసుకొచ్చి... రెండుసార్లు విక్రయించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తాత్కాలిక సిబ్బంది సహకరించాడని.. అతన్ని విధుల నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు.

a-man-tried-to-do-fraud-in-Adilabad-cotton-market-yard
ఆదిలాబాద్​ పత్తి మార్కెట్​యార్డులో బయట పడిన మోసం

By

Published : Dec 3, 2020, 4:38 PM IST

ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు సంస్థను బురిడీ కొట్టించి... దొరికిపోయిన ఘటన వెలుగుచూసింది. ఒకే వాహనంలో పత్తి తీసుకొచ్చి దాన్ని రెండు జిన్నింగ్‌లలో విక్రయించినట్లు రికార్డుల తనిఖీలో బయటపడింది.

తలమడుగు మండలానికి చెందిన ఓ రైతు మాక్స్‌ వాహనంలో 11 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా మార్కెట్‌యార్డులో దళారిగా పని చేసే మరో యువకుడు ఆ వాహనాన్ని జిన్నింగ్‌లోకి తీసుకెళ్లాడు. పత్తి ఖాళీచేయకుండానే తిరిగి యార్డుకు తీసుకెళ్లిపోయాడు. మళ్లీ తూకం వేయించి మరో జిన్నింగ్‌లో పత్తిని ఖాళీ చేయించాడు.

ఈ క్రమంలో రెండు చోట్ల పత్తి విక్రయాలు జరిగినట్లుగా రికార్డు నమోదు కాగా.. రెండుసార్లు సొమ్ము పొందాలని పన్నాగం వేశారు. ఈ వ్యవహారంలో తాత్కాలిక సిబ్బంది సహకారం ఉందని తేల్చిన అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. కేసు పెట్టాలని భావించినా తప్పిదాన్ని ఒప్పుకోవడంతో వదిలేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details