తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి కోసం పెదనాన్నను చంపేశాడు.. - CRIME NEWS IN ADHILABAD

కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదా చివరికి హత్యకు దారితీసింది. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేటలో జరిగింది.

A MAN KILLED HIS UNCLE FOR LAND IN GANGANNAPET
A MAN KILLED HIS UNCLE FOR LAND IN GANGANNAPET

By

Published : Mar 7, 2020, 11:53 AM IST

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేటలో ఆస్తి తగాదాలు ప్రాణాలు తీసేంత వరకు వెళ్లాయి. విశ్రాంత పోలీస్ ఉద్యోగి ఏఎస్ఐ శివరాజ్(62), ఉద్యానశాఖలో విధులు నిర్వహిస్తున్న జయరాజ్ మధ్య ఆస్తి తగాదాలు జరుగుతుండేవి. ఇదే విషయమై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండాపోయింది.

శివరాజ్​కు తన తమ్ముని కుమారుడు జయరాజ్​కి మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఘర్షణ తీవ్రంగా మారి కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘటనలో శివరాజ్​కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించగా... మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

మరణ వార్త విన్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శివరాజ్​కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కోసం పెదనాన్నను చంపేశాడు..

ఇవీ చూడండి:మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details