తెలంగాణ

telangana

Humanity: కన్న తల్లిలా.. కడుపు నింపుతోన్న టీచరమ్మ!

By

Published : May 28, 2021, 7:51 PM IST

Updated : May 28, 2021, 8:30 PM IST

దానాల్లో కెల్ల అన్నదానం గొప్పది అంటారు. స్వార్థంతో ఎవరి దారి వారే చూసుకుంటోన్న ప్రస్తుత కాలంలో.. ఆకలితో అలమటించే పేదలకు నిస్వార్థంగా సాయపడే వారూ ఉన్నారు. ఆ కోవకే చెందుతుందీ ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని. నిరుపేదల ఆకలి తీరుస్తూ, వారి అవసరాలను గుర్తిస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. మొదటి దశ సంక్షోభంలో వేల మందికి అండగా నిలిచి.. మళ్లీ సాటి వారికి సాయపడుతూ ముందుకెళ్తోన్న జయశ్రీ దంపతులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

teacher starving the poor
రోజుల తరబడి అన్నదానం

నెలల తరబడి అన్నదానం చేయడమంటే.. అనుకున్నంత సులవైన పనేం కాదు. ప్రతి రోజు అదే దినచర్యగా కొనసాగించడమనేది సాహసోపేతమైన నిర్ణయమే. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని జయశ్రీ.. గతేడాది లాక్​డౌన్‌లో 62 రోజుల పాటు అన్నదానం నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ రెండో దశలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఈనెల 12 నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు తానే వంట చేసి.. ఆకలితో అలమటిస్తోన్న కనీసం 75 మందికి భోజనం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

కష్ట కాలంలో పేదల ఆకలి తీర్చడం.. తమకెంతో సంతృప్తినిస్తోందంటున్నారీ దంపతులు. ఆపత్కాలంలో మానవతావాదులంతా ముందుకొచ్చి.. పేదలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇతరుల నుంచి నయా పైసా తీసుకోకుండా ఉదారతను చాటుకుంటోన్న ఈ భార్యాభర్తల గురించి తెలిసిన వారంతా.. వీరిని కొనియాడుతున్నారు.

మనసున్న టీచర్​..

ఇదీ చదవండి:Anandaiah: 'ఆనందయ్య మందుకు అనుమతివ్వాలి.. కార్పొరేట్​కు లొంగొద్దు'

Last Updated : May 28, 2021, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details