టోక్యో పారాలింపిక్స్లో ఆదివారం జరిగిన డిస్కస్ త్రో పోటీలో వినోద్ కాంస్యం(Vinod Kumar Discus throw) గెలిచినట్లు తొలుత ఖరారైనప్పటికీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ పతకాన్ని హోల్డ్లో ఉంచినట్లు తెలుస్తోంది. వినోద్ డిసేబిలిటీ క్లాసిఫికేషన్పై(Disability Classification) ఓ దేశం సందేహాలు లేవనెత్తి, ఫిర్యాదు చేసిన కారణంగా.. పతకాన్ని హోల్డ్లో పెట్టారు అధికారులు.
వినోద్(41).. 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. పోలాండ్కు చెందిన పీయోటర్ కోసెవిక్జ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా.. క్రోయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు.