తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2021, 8:51 AM IST

Updated : Jul 27, 2021, 10:21 AM IST

ETV Bharat / sports

షూటింగ్​లో ప్చ్​.. మిక్స్​డ్​ ఈవెంట్​లోనూ మను- సౌరభ్​ జోడీ ఓటమి

ఒలింపిక్స్​ షూటింగ్​లో 10 మీ. ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్ ఈవెంట్లో భారత జోడీ విఫలమైంది. మను బాకర్-సౌరభ్ చౌదరీ జంట క్వాలిఫికేషన్ స్టేజీ 2 మ్యాచ్​లో ఏడో స్థానంలో నిలిచి.. మెడల్​ మ్యాచ్​కు అర్హత సాధించలేకపోయింది. దీంతో మిక్స్​డ్ ఈవెంట్లో భారత కథ ముగిసింది.

Manu Bhaker, Saurabh Choudhary
మను బాకర్, సౌరభ్ చౌదరి

టోక్యో ఒలింపిక్స్​లో భారత షూటర్లు మరోసారి ఉసూరుమనిపించారు. 10మీ. ఎయిర్​ పిస్టల్ మిక్స్​డ్ ఈవెంట్​లో మను బాకర్​- సౌరభ్ చౌదరీ జోడీ విఫలమైంది. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్​ స్టేజీ 1 మ్యాచ్​లో అగ్రస్థానంలో నిలిచిన ఈ జంట.. స్టేజీ 2లో కొద్ది పాయింట్ల తేడాతో మెడల్​ మ్యాచ్​కు దూరమైంది.

క్వాలిఫికేషన్​ స్టేజీ 2 ఈవెంట్​లో ఈ ద్వయం 380 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తొలి సిరీస్​లో సౌరభ్ 96 పాయింట్లు సాధించగా, మను 92 పాయింట్లతో సరిపెట్టుకుంది. రెండో సిరీస్​లో వరుసగా 98, 94 పాయింట్లు జోడించారు. మెడల్​ మ్యాచ్​కు అర్హత సాధించడానికి ఈ స్కోరు సరిపోలేదు. దీంతో మిక్స్​డ్ ఈవెంట్లో భారత్​ కథ ముగిసింది.

అంతకుముందు క్వాలిఫికేషన్​ స్టేజీ 1లో మొత్తంగా 582 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి.. కచ్చితంగా ఏదో ఒక పతకం సాధించేలా కనిపించింది ఈ జోడీ. మరో జంట యశస్విని దేశ్వాల్​-అభిషేక్ వర్మ 17వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే వీరంతా వ్యక్తిగత ఈవెంట్లలో విఫలమయ్యారు.

ఇదీ చదవండి:Tokyo Olympics: వీరు బరిలో దిగితే గురి తప్పదంతే..

Last Updated : Jul 27, 2021, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details