తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2021, 7:53 AM IST

Updated : Jul 29, 2021, 9:00 AM IST

ETV Bharat / sports

డిఫెండింగ్​ ఛాంపియన్​పై విజయం- హాకీలో క్వార్టర్స్​కు!

టోక్యో ఒలింపిక్స్​లోని హాకీలో భారత్​ అద్భుత విజయం సాధించి.. క్వార్టర్​ ఫైనల్​ అవకాశాలను మెరుగుపర్చుకుంది. డిఫెండింగ్​ ఛాంపియన్​ అర్జెంటీనాను 3-1 తేడాతో ఓడించింది.

hockey
హాకీ

ఒలింపిక్స్​ హాకీలో భారత్​ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ అర్జెంటీనాను 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్​ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

నాలుగో క్వార్టర్‌లో రెండు గోల్స్‌తో ఆదరగొట్టింది భారత జట్టు. చివరి రెండు నిమిషాల్లో 2 గోల్స్​ చేయడం విశేషం.

తొలి అర్ధభాగం 0-0..

తొలి రెండు క్వార్టర్స్​ గోల్స్​ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్​లో 43వ నిమిషంలో కుమార్ వరుణ్ భారత్​కు తొలి గోల్ అందించాడు. వివేక్​ సాగర్​ ప్రసాద్​(58వ), హర్మన్​ ప్రీత్​ సింగ్​(59వ) నిమిషాల్లో గోల్స్​ చేసి భారత్​ ఆధిపత్యాన్ని 3-1కి పెంచారు. అర్జెంటీనాకు ఏకైక గోల్​ 48వ నిమిషంలో.. పెనాల్టీ కార్నర్​ రూపంలో వచ్చింది.

పూల్​ ఏలో.. ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో మూడింట గెలిచింది మెన్​ ఇన్​ బ్లూ. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా టాప్​లో ఉండగా.. ఇండియా రెండో స్థానంలో ఉంది. ఆరు జట్లలో నాలుగు క్వార్టర్స్​లోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన భారత్​ .. నాకౌట్​ చేరినట్లే. మెన్​ ఇన్​ బ్లూ.. తన చివరి ఐదో మ్యాచ్​లో జపాన్​తో తలపడనుంది.

అర్జెంటీనా క్వార్టర్​ ఫైనల్​ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. న్యూజిలాండ్​తో తన చివరి మ్యాచ్​లో గెలిస్తేనే అవకాశాలుంటాయి.

ఇదీ చూడండి: సింధు దూకుడు.. ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశం

Last Updated : Jul 29, 2021, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details