తెలంగాణ

telangana

వింబుల్డన్​: జకో ముందంజ.. జ్వెరెవ్​, సిట్సిపాస్​​​ ఓటమి

By

Published : Jul 2, 2019, 9:02 AM IST

ప్రతిష్ఠాత్మక గ్రాండ్​స్లామ్​ టోర్నీ వింబుల్డన్​లో సెర్బియా వీరుడు నొవాక్​ జకోవిచ్​ ముందంజ వేశాడు. సోమవారం జరిగిన మ్యాచ్​లో జర్మనీ క్రీడాకారుడు కొచ్రీబర్​పై గెలుపొందాడు. యువ ఆటగాళ్లు అలెగ్జాండర్​ జ్వెరెవ్​(జర్మనీ), సిట్సిపాస్​(గ్రీస్​) తొలి రౌండ్​లోనే ఓటమిపాలయ్యారు.

వింబుల్డన్​2019: జకో ముందంజ.. జ్వెరెవ్​, సిట్రిపాస్​లకు​ ఓటమి

మ్యాచ్​ హైలైట్స్​

వింబుల్డన్​ పురుషుల సింగిల్స్​ విభాగంలో డిఫెండింగ్​ ఛాంపియన్​ నొవాక్​ జకోవిచ్ (సెర్బియా)​రెండో రౌండ్​లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్​లో 6-3, 7-5, 6-3 తేడాతో కొచ్రీబర్​(జర్మనీ)పై విజయం సాధించాడు.

మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆరోసీడ్​ అలెగ్జాండర్​ జ్వెరెవ్​(జర్మనీ), ఏడో సీడ్​ స్టెఫనోస్​ సిట్సిపాస్​(గ్రీస్​)లకు షాక్​ తగిలింది. జ్వెరెవ్​ 6-4, 3-6, 2-6, 5-7తో వెస్లీ(చెక్) చేతిలో ఓడిపోయాడు. సిట్సిపాస్​ 4-6, 6-3, 4-6, 10-6, 3-6తో ఫాబియానో(ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.

వావ్రింకా (స్విట్జర్లాండ్​), అండర్సన్​(దక్షిణాఫ్రికా), కచనోవ్​(రష్యా), మెద్వెదెవ్​(రష్యా), కార్లోవిచ్​(క్రొయేషియా), తిప్సరెవిచ్​(సెర్బియా), సెప్పి(ఇటలీ) తొలి రౌండ్​ను అధిగమించారు.

పోరాడినా ఫలితం నిల్​..

సింగిల్స్​ మెయిన్​ డ్రా బరిలో నిలిచిన ఏకైక భారతీయుడు ప్రజ్ఞేశ్​ గుణేశ్వరన్​ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. 15వ సీడ్​ రోనిచ్​తో చివరి వరకు పోరాడి పరాభవం చెందాడు. రోనిచ్​ 7-6, 7-1, 6-4, 6-2తో ప్రజ్ఞేశ్​పై విజయం సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details