తెలంగాణ

telangana

ETV Bharat / sports

డేవిస్‌కప్‌లో పాక్​పై భారత్​ జోరు.. వార్​ వన్​సైడ్ - లియాండర్​ పేస్‌, టెన్నిస్​ క్రీడాకారుడు

పాకిస్థాన్‌తో జరిగిన డేవిస్‌కప్‌ పోరులో భారత్‌ అదరగొట్టింది.  అద్భుత ప్రదర్శన చేసిన భారత బృందం 4-0తో చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసి 2020 ప్రపంచ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌-జీవన్‌ నెదుంచెజియన్‌ డబుల్స్‌లో గెలవగా, రివర్స్​ సింగిల్స్​లో సుమిత్​ నగాల్​ విజయం సాధించాడు.

india lead into 4-0 against pakistan in davis cup qualifiers in nur sultan(kazakhstan
డేవిస్‌కప్‌లో పాక్​పై భారత్​ జోరు... 4-0తో ముందంజ

By

Published : Dec 1, 2019, 7:48 AM IST

కజకిస్థాన్​లోని నూర్​-సుల్తాన్​ వేదికగా జరిగిన డేవిస్‌కప్‌లో భారత్‌ తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంది. సీనియర్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ మెరిసిన వేళ భారత బృందం 4-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్​ల్లో 4-0 తేడాతో గెలుపొంది డేవిస్ కప్​ క్వాలిఫయర్స్​కు అర్హత సాధించింది.

వయసు పెరిగినా ఆట తగ్గలేదు...

శనివారం జరిగిన డబుల్స్‌ పోరులో లియాండర్‌-జీవన్‌ జోడీ మహ్మద్​ షోయబ్​-అబ్దుల్​ రెహ్మన్​ను చిత్తు చేసింది. 6-1, 6-3 తేడాతో గెలిచింది భారత జట్టు. 46 ఏళ్ల పేస్‌ ఆట రెండోరోజు హైలైట్‌గా నిలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్‌, జీవన్‌ ధాటికి పాక్‌ జోడీ నిలవలేకపోయింది.

తొలి సెట్లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 5-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పేస్‌ ద్వయం.. ఆ తర్వాత 6-1తో సెట్‌ గెలుచుకుంది. రెండో సెట్లో ప్రత్యర్థి కాస్త మెరుగ్గా ఆడి 3-3తో నిలిచినా.. ఎనిమిదో గేమ్‌లో పాక్‌ జోడీ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన లియాండర్‌ ద్వయం.. 5-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరికి సర్వీస్‌ నిలబెట్టుకుని 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ నెగ్గింది.

డేవిస్‌కప్‌లో గతేడాది 43వ డబుల్స్‌ మ్యాచ్‌ గెలిచి.. ఈ టోర్నీలో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా నికోలా పీట్రాంజెలి రికార్డు బ్రేక్​ చేశాడు పేస్‌. తాజా విజయంతో తన రికార్డును తానే సవరిస్తూ 44వ విజయం ఖాతాలో వేసుకున్నాడు.

"డేవిస్‌ కబ్‌ డబుల్స్‌లో నాకిది 44వ విజయమైనా.. తొలి గెలుపులాగే అనిపిస్తోంది. ఏ విజయానికదే ప్రత్యేకం. భారత్‌ పేరుని రికార్డు పుస్తకాల్లోకి చేర్చడాన్ని గొప్పగా భావిస్తున్నా".
-లియాండర్​ పేస్‌, టెన్నిస్​ క్రీడాకారుడు

డేవిస్‌కప్‌లో పేస్‌ 92 మ్యాచ్​లు గెలిచాడు. ఇందులో 44 డబుల్స్‌, 48 సింగిల్స్‌ విజయాలు ఉన్నాయి.

త్రివర్ణ పతాకంతో భారత బృందం

సింగిల్స్​లోనూ...

శనివారం జరిగినరివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో భారత ఆటగాడు సుమిత్‌ నగాల్‌ 6-1, 6-0 తేడాతో యూసెఫ్‌ ఖలీల్‌ను ఓడించి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు. ఫలితంగా భారత బృందం 4-0 ఆధిక్యంతో గెలిచింది. వచ్చే ఏడాది మార్చి 6, 7 తేదీల్లో జరిగే ప్రపంచ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌ పోరులో భారత్‌.. క్రొయేషియాతో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details