తెలంగాణ

telangana

ETV Bharat / sports

10 నిమిషాల్లో... 48వేల టికెట్లు ఫసక్​!

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫెదరర్​ - నాదల్ ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్​లో తలపడనున్నారు. దక్షిణాఫ్రికాలోని కేప్​టౌన్ ఈ ఆట​కు వేదిక. బుధవారం ఈ మ్యాచ్​ ​కోసం అంతర్జాలంలో టికెట్లు ఉంచారు నిర్వాహకులు. దీనికి ఊహించని స్పందన లభించింది. కేవలం 10 నిమిషాల్లో 48వేల టికెట్లు అమ్ముడయ్యాయి.

By

Published : Sep 5, 2019, 12:54 PM IST

Updated : Sep 29, 2019, 12:42 PM IST

నాదల్ - ఫెదరర్

టెన్నిస్ ఆటగాళ్లు ఎంతమంది ఉన్నా.. రోజర్ ఫెదరర్​ - రఫెల్ నాదల్ పోరు ఎప్పుడూ ప్రత్యేకమే. వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్​ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎంతలా అంటే వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో వీరి మధ్య జరగనున్న ఓ ఎగ్జిబిషన్​ మ్యాచ్​ కోసం అందుబాటులో ఉంచిన టికెట్లు 10 నిమిషాల్లో అమ్ముడైపోయాయి.

ఈ మ్యాచ్​ టికెట్లను బుధవారం అంతర్జాలంలో ఉంచారు నిర్వాహకులు. దాదాపు 48వేల టికెట్లు కేవలం 10 నిమిషాల్లో కొనుగోలు చేశారు టెన్నిస్​ ప్రియులు. ఒక్కో టికెట్ ధర 10 నుంచి 130 డాలర్ల(రూ. 710 - రూ. 9348) వరకు ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న మ్యాచ్​ జరగనుంది.

2010లో సెరెనా - కిమ్ మధ్య జరిగిన మ్యాచ్​కు 35వేల 681 మంది హాజరయ్యారు. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఈ మ్యాచ్​తో ఆ రికార్డు బ్రేక్​ కానుంది.

ఇది చదవండి: యూఎస్ ఓపెన్​ సెమీస్​లో రఫెల్ నాదల్

Last Updated : Sep 29, 2019, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details