తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రెంచ్​ ఓపెన్​: తొలి రౌండ్​లోనే దివిజ్​ ఔట్​

పురుషుల డబుల్స్​లో భారత్​కు చెందిన దివిజ్​ శరణ్​ ఓడిపోయాడు. ఫలితంగా ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఫ్రెంచ్​ ఓపెన్​లో భారత్​ తరఫున రోహన్ బోపన్న మాత్రమే కొనసాగుతున్నాడు.

By

Published : Oct 1, 2020, 1:10 PM IST

Updated : Oct 1, 2020, 1:20 PM IST

Divij
దివిజ్​

ఫ్రెంచ్​ ఓపెన్​ నుంచి భారత్​కు చెందిన దివిజ్​ శరణ్​ నిష్క్రమించాడు. పారిస్​ వేదికగా జరిగిన పురుషుల డబుల్స్​ ఓపెనింగ్​ రౌండ్​లో ఓడిపోవడం వల్ల.. దివిజ్​తో పాటు, అతడి భాగస్వామి క్వాన్​ సూన్​వూ(దక్షిణకొరియా)లు వైదొలగాల్సి వచ్చింది.

రోహన్​ బోపన్న

16వ సీడ్​ క్రొయేషియన్​- ఆమెరికన్​ జంట ఫ్రాంకో స్కుగోర్​, ఆస్టిన్​ క్రాజిసెక్​ చేతిలో 2-6,6-4,4-6 తేడాతో శరణ్​, క్వాన్​ సూన్ చిత్తుగా ఓడారు. ఫ్రెంచ్​ ఓపెన్​లో భారత్​ తరఫున రోహన్​ బోపన్న మాత్రమే ఇంకా ఆడుతున్నాడు. గురువారం జరిగే మ్యాచ్​లో డెనిస్​ షాపోవాలోవ్(కెనడా)​తో కలిసి బరిలోకి దిగనున్నాడు.

Last Updated : Oct 1, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details