తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wimbledon news: మన ప్లేయర్లతో మన ప్లేయర్లు మ్యాచ్

ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నీ వింబుల్డన్​లో ఓ ఆసక్తికర విషయం జరిగింది. గ్రాండ్​స్లామ్​ చరిత్రలో మన ప్లేయర్లతో మన వాళ్లే తలపడటం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా సానియా మీర్జా-బోపన్న జోడీతో రామ్​కుమార్-అంకిత తలపడ్డారు. ఇంతకీ ఫలితం ఏమైందంటే?

By

Published : Jul 2, 2021, 8:00 PM IST

Bopanna-Mirza pair wins historic all-Indian Wimbledon match
వింబుల్డన్

వింబుల్డన్​లో(Wimbledon) భారత ద్వయం రోహన్ బోపన్న-సానియా మీర్జా(Sania mirza) జోడీ.. మన దేశానికే చెందిన రామ్​కుమార్ రామ్​నాథన్- అంకితా రైనాపై(Ankitha Raina) 6-2, 7-6(5) తేడాతో గెలిచింది. శుక్రవారం జరిగిన మిక్స్​డ్ డబుల్స్​లో తొలిరౌండ్​లో ఈ ఫలితం ఎదురైంది. గ్రాండ్​స్లామ్​లో(Grandslam) చరిత్రలోనే మన దేశానికి చెందిన ప్లేయర్లు తలపడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మరోవైపు సింగిల్స్​ విభాగంలో పోటీపడనున్న రామ్​కుమార్.. 21 ప్రయత్నాల తర్వాత వింబుల్డన్​ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.

సానియా మీర్జా- రోహన్ బోపన్న

మహిళల డబుల్స్​లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసిన సానియా మీర్జా.. గురువారం జరిగిన రెండో రౌండ్​లో అంకితా రైనా-లారెన్ డేవిస్​పై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల డబుల్స్​లో తొలి రౌండ్​లోనే ఓడిన బోపన్న-దివిజ్ శరణ్ జోడీ.. వింబుల్డన్​ నుంచి ఇప్పటికే నిష్క్రమించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details