ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు రోహన్ బోపన్న, లియాండర్ పేస్ అదరగొట్టేస్తున్నారు. ఈరోజు జరిగిన మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-నదియా కిచెనొక్(ఉక్రెయిన్) జోడీ.. నికోలే మెలికార్-బ్రూనోపై 6-4, 7-6 తేడాతో నెగ్గింది. ఫలితంగా ఈ విజయంతో టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది బోపన్న జంట.
ఆస్ట్రేలియా ఓపెన్లో బోపన్న, పేస్ ముందంజ - Bopanna in quarters
ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగిన రోహన్ బోపన్న, లియాండర్ పేస్ టోర్నీలో మరింత ముందంజ వేశారు. తాజాగా జరిగిన ఆయా మ్యాచ్ల్లో గెలిచి బోపన్న క్వార్టర్స్లో అడుగుపెట్టగా, పేస్ రెండో రౌండ్కు చేరాడు.
![ఆస్ట్రేలియా ఓపెన్లో బోపన్న, పేస్ ముందంజ Australian Open 2020:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5850188-1095-5850188-1580042197749.jpg)
ఆస్ట్రేలియా ఓపెన్లో బోపన్న,పేస్ ముందంజ
పేస్కు ఆఖరిది...
ఆస్ట్రేలియా ఓపెన్లో మరో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ జోడీ కూడా ముందంజ వేసింది. మిక్స్డ్ విభాగంలో పేస్-జెలెనా(లాత్వియా) కలిసి బరిలోకి దిగారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో స్టోర్మ్-మార్క్ను ఓడించారు. వీరిద్దరూ 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్లు కావడం విశేషం. ఈ రెండు జోడీల మధ్య పోరు దాదాపు గంట 27 నిమిషాలు సాగింది. ఈ ఓపెన్లో చివరిసారి ఆడుతున్నాడు 46 ఏళ్ల లియాండర్ పేస్.
Last Updated : Feb 25, 2020, 5:13 PM IST