తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2021, 10:31 PM IST

ETV Bharat / sports

మ్యాచ్​ మధ్యలో కెప్టెన్ కోహ్లీ క్రేజీ డ్యాన్స్

అఫ్గాన్​తో జరిగిన టీ20 వరల్డ్​కప్ మ్యాచ్​లో భారత క్రికెట్ సారథి కోహ్లీ స్టెప్పులేసి అదరగొట్టాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్​గా మారింది.

dance
కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మైదానంలో అప్పుడప్పుడు హంగామా చేస్తుండటం అందరికీ తెలుసు. పలు సందర్భాల్లో తన ఎమోషన్స్ ప్రదర్శించి అభిమానులకు ఉత్సాహం నింపుతుంటాడు. టీ20 వరల్డ్​కప్​లో భాగంగా బుధవారం అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో విరాట్​ చేసిన డ్యాన్స్​ అందరినీ అబ్బురపరిచింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

అఫ్గాన్​తో మ్యాచ్​లో తొలుత టాస్​ ఓడిన టీమ్​ఇండియా బ్యాటింగ్​ చేసింది. కేఎల్ రాహుల్ 69 పరుగులు​, రోహిత్​ శర్మ 74 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన మరో ఇద్దరూ రెచ్చిపోయారు. ఫలితంగా అఫ్గాన్​కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని​ నిర్దేశించింది భారత్.

అనంతరం భారత జట్టు ఫీల్డింగ్​ సమయంలో విరాట్​ బౌండరీ లైన్ వద్దకు వస్తుండగా పాపులర్ హిందీ పాట.. 'మై నేమ్​ ఈజ్​ లఖన్​' ప్లే అయింది. ఆ పాట వినగానే ఉత్సాహంగా స్పెప్పులేశాడు కోహ్లీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్​లో భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ చేతులెత్తేసింది. ఓవర్లన్నీ ఆడినా.. ఆఫ్గాన్​ కేవలం 144 పరుగులు​ మాత్రమే చేసింది. ఫలితంగా టీ20 వరల్డ్​ కప్​లో టీమ్​ఇండియాకు తొలి గెలుపు సొంతమైంది.

ఇదీ చదవండి :ఘనంగా దీపావళి వేడుకలు.. గల్లీగల్లీలో టపాసుల మోతలు..

ABOUT THE AUTHOR

...view details