తెలంగాణ

telangana

Kohli Jadeja: కోహ్లీ వ్యాఖ్యలపై జడేజా అసంతృప్తి!

By

Published : Oct 28, 2021, 1:30 PM IST

ఓపెనర్లు విఫలమైన వేళ టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమ్​ఇండియా. ఓటమి అనంతరం కోహ్లీ (Virat Kohli News) చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయడని చెప్పాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja News).

jadeja on kohli
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) పాకిస్థాన్​ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు (Jadeja on Kohli) అసంతృప్తికి గురిచేసినట్లు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (ajay jadeja news) చెప్పాడు. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. పాక్ బౌలర్​ షహీన్​ అఫ్రిది (Shaheen Afridi News) విధ్వం సృష్టించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్​ రాహుల్​ను ప్రారంభంలోనే పెవిలియన్ చేర్చిన ఈ బౌలర్.. టీమ్​ఇండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాడు.

మ్యాచ్​ (IND VS PAK) అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడం వల్ల వెనకడుగు వేయాల్సి వచ్చిందని కోహ్లీ (Virat Kohli News) అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల విభేదించిన జడేజా.. కోహ్లీ స్థాయి ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు టీమ్​ఇండియాను పోటీలోకి తీసుకురావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని (Ajay Jadeja on Kohli) చెప్పాడు.

"ఆ రోజు కోహ్లీ చెప్పింది విన్నాను. '2 వికెట్లు పడగానే.. మ్యాచ్​లో వెనకడుగు వేశాం' అని అన్నాడు. అది కాస్త నిరాశకు గురిచేసింది. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు మిడిల్​ ఆర్డర్​లో ఉంటే.. మ్యాచ్​ ఊరికే చేజారదు. కనీసం బంతులైనా ఆడకముందే కోహ్లీ.. అలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే టీమ్​ఇండియా ఆలోచనా విధానాన్ని సూచిస్తోంది"

- అజయ్ జడేజా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

రిషభ్ పంత్​తో కలిసి భారత్​కు 151 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు కోహ్లీ(57). చివరివరకు క్రీజులో ఉన్న అతడు 19వ ఓవర్లో షహీన్​ చేతికే చిక్కాడు. అయితే టీమ్​ఇండియా విధించిన లక్ష్యాన్ని వికెట్​ నష్టపోకుండా ఛేదించారు పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్.

ఇవీ చూడండి:

T20 worldcup 2021: తేలిపోయిన భారత్​.. పాకిస్థాన్​ ఘన విజయం

IND vs PAK: ఎంత ఎదురుచూసినా.. ఈసారి ఏ మాయ జరగలేదు!

IND vs PAK: పాక్​పై భారత్ ఎందుకిలా ఓడిపోతోంది?

ABOUT THE AUTHOR

...view details