తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 4:08 PM IST

ETV Bharat / sports

మార్చి 19న బాక్సింగ్​ రింగ్​లోకి విజేందర్​

కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత బాక్సర్​ విజేందర్​ సింగ్​ తిరిగి బాక్సింగ్​ రింగ్​లోకి అడుగుపెట్టనున్నాడు. మార్చి 19 నుంచి గోవా వేదికగా జరిగే పోటీల్లో పాల్గొంటాడని అతడి ప్రమోటర్లు పేర్కొన్నారు.

Vijender to play upcoming boxing bout on deck of casino ship
మార్చి 19న బాక్సింగ్​ రింగ్​లోకి విజేందర్​

భారత ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్ సింగ్ మార్చి 19న రింగ్​లోకి దిగనున్నాడు. గోవా వేదికగా జరుగనున్న మెజెస్టిక్​ కాసినో ప్రైడ్​ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. మెజెస్టిక్ ప్రైడ్​ కాసినో షిప్​ పైకప్పు మీద ఈ పోటీలు జరగనున్నాయి. ఇది వెగాస్​ తరహా బాక్సింగ్​ శైలి. పనాజీలోని మండోవి నదిలో ఈ బాక్సింగ్​ను నిర్వహించనున్నారు. త్వరలోనే ప్రత్యర్థి పేరు ప్రకటిస్తామని విజేందర్​ ప్రమోటర్లు స్పష్టం చేశారు.

2019లో చివరిసారిగా బాక్సింగ్ రింగ్​లో కనిపించిన విజేందర్​ సింగ్.. ప్రొఫెషనల్​ బాక్సింగ్​లో వరుసగా 12 విజయాలు నమోదు చేశాడు. కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు ఈ బాక్సర్​.

ఇదీ చదవండి:వచ్చే నెలలో బాక్సింగ్​ రింగ్​లోకి​ విజేందర్ ​​

ABOUT THE AUTHOR

...view details