ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్ సత్తాచాటాడు. పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో టైటిల్ను నిలబెట్టుకున్న అతడు 2020 టోక్యో పారా ఒలింపిక్స్ బెర్త్నూ సాధించాడు.
ఆదివారం జరిగిన పోటీల్లో సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో జావెలిన్ను 61.22 మీటర్ల దూరం విసిరిన సుందర్ పసిడి కైవసం చేసుకున్నాడు.అజీత్ సింగ్, రింకూలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అజీత్ 59.46 మీటర్ల దూరం విసిరి కాంస్యం సాధించాడు.