తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2021, 2:26 PM IST

ETV Bharat / sports

పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు గుర్తింపు

ఎట్టకేలకు భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు మోక్షం లభించింది. దానిని జాతీయ సమాఖ్యగా గుర్తిస్తూ కేంద్ర క్రీడా శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Sports Ministry restores recognition of Gymnastics Federation of India
పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు గుర్తింపు

దాదాపు పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్య (జీఎఫ్​ఐ)ను జాతీయ క్రీడా సమాఖ్య(ఎన్​ఎస్​ఎఫ్​)గా గుర్తింపును పునరుద్ధరించింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ ఏడాది డిసెంబర్​ 31 వరకు ఈ గుర్తింపు అమల్లో ఉంటుంది. జీఎఫ్​ఐలో అంతర్గత కలహాల కారణంగా 2011లో దాని గుర్తింపు రద్దైంది.

గుర్తింపుతో పాటు 2019-2023 కాలానికి జీఎఫ్​ఐ అధ్యక్షుడిగా సుధీర్ మిట్టల్, కోశాధికారిగా కౌశిక్ బిడివాలా ఎన్నికను ధ్రువీకరించింది కేంద్రం. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శాంతి కుమార్​ సింగ్​ పదవిపై మణిపూర్​ హైకోర్టు ఉత్తర్వుల తర్వాత నిర్ణయిస్తామని సుధీర్​కు పంపిన లేఖలో చెప్పింది.

క్రీడల మంత్రిత్వ శాఖ

నిబంధనలు పాటిస్తేనే..

జాతీయ క్రీడా సమాఖ్యలకు ఏటా గుర్తింపు ఇస్తుంటుంది క్రీడల శాఖ. 2011 క్రీడా స్మృతిలోని నిబంధనలు తప్పకుండా పాటిస్తేనే జీఎఫ్​ఐకి గుర్తింపు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సిబ్బంది నియామకం జరగాలని, జీఎఫ్​ఐలో రాజ్యంగ మార్పునకు కనీసం రెండు నెలల ముందు నోటీసు ఇవ్వాలని తెలిపింది. షరతులను ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఇదీ చూడండి:స్ట్రాంజా బాక్సింగ్‌ సెమీస్‌లో దీపక్‌ సంచలనం

ABOUT THE AUTHOR

...view details