తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2021, 1:41 PM IST

ETV Bharat / sports

క్రీడాసౌకర్యాలకు ఆటగాళ్ల పేర్లు పెట్టే యోచనలో సాయ్

దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుల పేర్లను వివిధ నిర్మాణాలకు పెట్టడానికి సిద్ధమైంది క్రీడా మంత్రిత్వ శాఖ. దీని ద్వారా క్రీడా సంస్కృతి పెంపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆటగాళ్లనూ గౌరవించినట్లవుతుందని పేర్కొంది.

Sports Ministry decides to name all new, upgraded sporting facilities after sportspersons
క్రీడాసౌకర్యాలకు పేర్లు పెట్టే యోచనలో సాయ్

దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఆటగాళ్ల పేర్లను.. స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎస్​ఏఐ)లోని క్రీడా సౌకర్యాలకు పెట్టనున్నట్లు క్రీడామంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా భారత్​లోని క్రీడా వీరులను గౌరవించినట్లవుతుందని పేర్కొంది.

మొదటి దశలో భాగంగా.. లఖ్​​నవూ, భోపాల్​, సోనేపట్​లలో ఉన్న నేషనల్ సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​(ఎన్​సీఓఈ)లలో నిర్మిస్తున్న పలు కట్టడాలతో పాటు.. గుహవాటిలో నిర్మించనున్న సాయ్​ శిక్షణ కేంద్రానికి అక్కడి స్థానిక ఆటగాళ్ల పేర్లను పెట్టనున్నారు. అందుకు అర్హులైన ఆటగాళ్ల పేర్లను మాత్రం మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.

''దేశంలో క్రీడా సంస్కృతిని విస్తరించాలంటే అందుకు అర్హులైన ఆటగాళ్లను గౌరవించడం చాలా ముఖ్యం. అప్పుడే యువతరం ఆటలను వృత్తిగా చేపట్టడానికి ముందుకొస్తారు.''

-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి.

ఇదీ చదవండి:గబ్బా టెస్టులో సుందర్​, ఠాకూర్ రికార్డు భాగస్వామ్యం

ABOUT THE AUTHOR

...view details