తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిబ్రవరి 22 నుంచి ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్ - ఫిబ్రవరి 21 నుంచి ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్

ఖేలో ఇండియా యూనివర్సీటీ గేమ్స్-2020 షెడ్యూల్​ను ప్రకటించారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు. ఈ పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరగనున్నట్లు తెలిపారు.

Sports Minister Kiran Rijiju announces schedule of Khelo India University Games 2020
ఫిబ్రవరి 21 నుంచి ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్

By

Published : Jan 7, 2020, 12:45 PM IST

Updated : Jan 7, 2020, 5:45 PM IST

ఫిబ్రవరి 21 నుంచి ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్

మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షెడ్యూల్​ను ప్రకటించారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు. ఒడిశా వేదికగా ఫిబ్రవరి 22నుంచి ఈ పోటీలు ప్రారంభంకానున్నాయని చెప్పారు. మార్చి 1 వరకు ఈ ఆటలు జరగనున్నాయని అన్నారు. 17 విభిన్నమైన క్రీడల్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

"మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సీటీ గేమ్స్-2020 షెడ్యూల్​ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు ప్రకటించారు. ఒడిషా భువనేశ్వర్ వేదికగా ఈ క్రీడలు ప్రారంభమవుతాయి." -ఖేలో ఇండియా ట్వీట్.

ఒడిషా భువనేశ్వర్​లో కిరణ్​ రిజిజు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధర్మేంద్ర ప్రదాన్ ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్​-2020 లోగోను ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: 'మ్యాచ్​ రద్దుకు ముందే ఆటగాళ్లు వెళ్లిపోయారు'

Last Updated : Jan 7, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details