తెలంగాణ

telangana

శాగ్​ క్రీడల్లో భారత్​ 'సెంచరీ'... అగ్రస్థానం కైవసం

By

Published : Dec 6, 2019, 9:02 AM IST

దక్షిణాసియా క్రీడల్లో(శాగ్​) భారత్​ పతకాల పంట పండించింది. గురువారం ఒక్కరోజే 56 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటికి మొత్తంగా 124 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

South Asian Games 2019: India win 56 medals on one day and breach 100-mark to consolidate top spot
శాగ్​ క్రీడల్లో భారత్​ 'సెంచరీ'... అగ్రస్థానం కైవసం

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల సెంచరీ కొట్టేసింది. గురువారం ఏకంగా 50 మెడల్స్​ సొంతమయ్యాయి. స్విమ్మింగ్‌, ఉషు, వెయిట్‌లిఫ్టింగ్‌, తైక్వాండో, అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండింది. నాలుగోరోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్య పతకాలు ఖాతాలో చేరాయి. ఫలితంగా మొత్తం 62 స్వర్ణ, 41 రజత, 21 కాంస్య పతకాలతో సహా 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది భారత్​.

నేపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో... స్విమ్మింగ్‌, ఉషు, వెయిట్‌లిఫ్టింగ్‌, తైక్వాండో, అథ్లెటిక్స్‌లో భారత్‌ క్రీడాకారుల హవా కొనసాగింది.వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుంది. మహిళల 45 కేజీల విభాగంలో జిల్లీ పసిడి గెలవగా, స్నేహ సోరెన్‌ (49 కేజీలు), బింద్యారాణి (55 కేజీలు) స్వర్ణాలు సాధించారు. పురుషుల 61 కేజీల విభాగంలో సిద్ధాంత్‌ గొగోయ్‌ పసిడి గెలిచాడు. స్విమ్మింగ్‌లో 4 స్వర్ణ, 6 రజత, 1 కాంస్యం దక్కగా.. తైక్వాండోలో 3 పసిడి పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలు ఖాతాలో చేరాయి.

మరో మూడు ఖాయం​..

తెలుగుతేజాలు గాయత్రి, సిరిల్‌వర్మ... బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ఫైనల్‌ చేరారు. గాయత్రి 21-17, 21-14 తేడాతో దిల్మి దియాస్‌ (శ్రీలంక)ను ఓడించింది. మరో సెమీస్‌లో అస్మిత 21-5, 21-7తో అచిని రత్నసిరి (శ్రీలంక)ని చిత్తు చేసింది. స్వర్ణ పోరులో భారత షట్లర్లు గాయత్రి, అస్మిత తలపడనున్నారు.

పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సిరిల్‌వర్మ 21-9, 21-12తో దినుక కరుణరత్నె (శ్రీలంక)ను ఓడించగా, మరో సెమీస్‌లో ఆర్యమన్‌ టాండన్‌ 21-18, 14-21, 21-18తో రత్నజిత్‌ తమాంగ్‌ (నేపాల్‌)పై గెలిచాడు.

ABOUT THE AUTHOR

...view details