తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్​షిప్​: సాక్షిమాలిక్​కు షాకిచ్చిన సోనమ్.

లఖ్​నవూ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్​షిప్​లో సాక్షిమాలిక్​పై నెగ్గి సంచలనం సృష్టించింది సోనమ్ మాలిక్. మరో మ్యాచ్​లో వరల్డ్ ఛాంపియన్​షిప్​ పతక విజేత పుజాపై విజయం సాధించింది జూనియర్ అన్షూ మాలిక్.

By

Published : Jan 4, 2020, 5:00 PM IST

Sonam shocks Olympic medallist Sakshi Malik in trials
సాక్షిమాలిక్

రియో ఒలింపిక్స్​ పతక గ్రహీత, రెజ్లర్ సాక్షి మాలిక్​కు షాకిచ్చింది సోనమ్ మాలిక్. లఖ్​నవూ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్​షిప్​లో సాక్షిని ఓడించి ఫైనల్ చేరింది. తుదిపోరులో రాధికపై 4-1 తేడాతో విజయం సాధించి.. 62 కేజీల విభాగంలో ఒలింపిక్ ట్రయల్స్​ కోసం భారత జట్టులో అర్హత సాధించింది.

4-6 తేడాతో వెనుకంజలో ఉన్న సోనమ్​.. అనూహ్యంగా పుంజుకుని ఆఖరి మూడు సెకండ్లలో నాలుగు పాయింట్లు సాధించింది. చివరకు 10-10 తేడాతో స్కోరు సమంగా ఉండగా.. మళ్లీ ఆఖరు పాయింట్​ సాధించి సాక్షిపై నెగ్గింది.

57 కేజీల విభాగంలో వరల్డ్ ఛాంపియన్​షిప్​ పతక గ్రహీత పూజా ధందాను ఓడించింది అన్షూ మాలిక్. ఫైనల్లో మానసిపై నెగ్గి సత్తాచాటింది. ఈ టోర్నీలో 53, 68 కేజీల విభాగాల్లో వినేశ్​ ఫొగాట్, దివ్య కక్రాన్ విజేతలుగా నిలిచారు. నిర్మలా దేవి, కిరణ్ గోడారా.. 50, 76 కేజీల విభాగాల్లో విజయం సాధించారు.

ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన రెజ్లర్లు ఫస్ట్​ ర్యాంకింగ్ సిరీస్(రోమ్​ - జనవరి 15-18)​, ఆసియా ఛాంపియన్​షిప్​(దిల్లీ- ఫిబ్రవరి 18-23) తలపడతారు. ఈ రెండు టోర్నీల్లో పతకాలు గెలిచిన వాళ్లు మార్చి 27 నుంచి 29 వరకు చైనాలో జరగనున్న ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలకు అర్హత సాధిస్తారు.

ఇదీ చదవండి: '4 రోజుల మ్యాచ్​ల వల్ల టెస్టు పవిత్రత దెబ్బతింటుంది'

ABOUT THE AUTHOR

...view details