టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలేలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జ్యోతి యాత్ర కార్యకలాపాల్లో పాల్గొన్న మరో ఆరుగురికి వైరస్ సోకింది. దీంతో బాధితుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. వీరందరూ మాస్కులు ధరించడం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మహమ్మారి బారిన పడ్డారని వెల్లడించారు. ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఒలింపిక్స్పై రోజుకో మాట