తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 2:28 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్ కోసం సోషల్ మీడియాకు దూరమైన రెజ్లర్

టోక్యో ఒలింపిక్స్​ను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు భారత రెజ్లర్​ భజరంగ్​ పూనియా. ఒలింపిక్స్ అనంతరం వాటిలోకి రీఎంట్రీ ఇస్తానని అన్నాడు.

Shutting my social media handle till Olympics: Bajrang
'అందుకే సోషల్​ మీడియాను వదిలేస్తున్న'

అన్ని సామాజిక మాధ్యమాలకు కొంత కాలం దూరంగా ఉండనున్నట్లు భారత రెజ్లర్ భజరంగ్​ పూనియా ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఒలింపిక్స్​ అనంతరం సోషల్​ మీడియాలోకి మళ్లీ వస్తానని స్పష్టం చేశాడు.

"నా సామాజిక మాధ్యమాల ఖాతాలన్నింటిని ఈ రోజు నుంచి నిలిపివేస్తున్నాను. పోటీల​ అనంతరం తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అప్పటివరకు నాపై అదే ప్రేమ కురిపిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్"​ అని భజరంగ్​ ట్వీట్​ చేశాడు.

2019 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రజత పతకం గెల్చుకున్న భజ్​రంగ్.. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. అతడు 65 కిలోల విభాగంలో బరిలోకి దిగనున్నాడు. దిల్లీ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఆసియా సీనియర్​ ఛాంపియన్​షిప్స్​లో భజరంగ్​ చివరిసారిగా పాల్గొన్నాడు. ​'మార్చిలో జరిగే రోమ్​ ర్యాంకింగ్ సిరీస్​, ఆసియా​ ఛాంపియన్​షిప్స్​లోనూ బరిలోకి దిగుతాను' అని​ వెల్లడించాడు.

దేశం గర్వించే ప్రదర్శన చేస్తారు..

రాబోయే ఒలింపిక్స్​లో భారత బృందంపై ఆశాజనకంగా స్పందించారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు. దేశం గర్వించే ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'కొవిడ్ కారణంగా ఒలింపిక్స్​ ఓ ఏడాది వాయిదా పడ్డాయి. అయితే తేదీల్లో మాత్రం మార్పు లేదు' అని మంత్రి పేర్కొన్నారు.

అథ్లెట్లకు టీకా పంపిణీ ఎప్పుడు అన్న ప్రశ్నపై స్పందించిన​ రిజిజు.. "ప్రస్తుతం కరోనా వారియర్స్​కు వ్యాక్సినేషన్​ కార్యక్రమం జరుగుతోంది. ఆటగాళ్లకు టీకా పంపిణీ గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిని సంప్రదించాం. వారి నుంచి అనుమతులు రాగానే అథ్లెట్లకు వ్యాక్సిన్​ ఇస్తాం" అని తెలిపారు.

ఇదీ చదవండి:'ఒలింపిక్స్​ ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ టీకా'

ABOUT THE AUTHOR

...view details